ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్సై అజయ్ బాబుపై సస్పెన్షన్ వేటు
- వేటపాలెంలో దొంతు వెంకటేశ్వరరెడ్డి హత్య
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన ఎస్సై
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఆరోపణలు
ఇటీవల వేటపాలెంలో దొంతు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే, ఎస్సై అజయ్ బాబు ఆ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాడు. తద్వారా ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ విచారణకు ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.