Nepal: చైనా తమ భూభాగాలను ఆక్రమించిందన్న కథనాలను ఖండించిన నేపాల్

  • నేపాల్ తో సరిహద్దులను పంచుకుంటున్న చైనా
  • ఏడు జిల్లాలను విస్తరించిందంటూ కథనాలు
  • గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయన్న నేపాల్
Nepal denies China encroachment into their border

నేపాల్ కు చెందిన పలు భూభాగాలను చైనా ఆక్రమించిందని, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సహకారంతో చైనా తెగబడిందని మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై నేపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కథనాలను ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న అంశాల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. నేపాల్ తో సరిహద్దులు పంచుకుంటున్న తన ఏడు జిల్లాలను చైనా విస్తరిస్తోందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఇందుకు నేపాల్ వ్యవసాయ శాఖ సర్వే విభాగం నివేదికే సాక్ష్యం అంటూ ఆ కథనాల్లో వెల్లడించారు. అయితే నేపాల్ ప్రభుత్వ వర్గాలు ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి. నేపాల్ కు చెందిన ఒక ప్రముఖ పత్రిక జూన్ లోనే ఈ తరహా ఆరోపణలు చేసిందని, ఆపై తప్పుడు కథనాలకు క్షమాపణలు తెలిపిందని వివరించాయి. ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాయి.

More Telugu News