Srisailam: ఇంత దారుణాన్ని ఎన్నడూ చూడలేదు: కన్నీటిపర్యంతమైన టీఎస్ జెన్ కో సీఎండీ

  • శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 9 మంది దుర్మరణం
  • ఎంతో దుఃఖాన్ని కలిగించిందన్న ప్రభాకర్ రావు
  • వీర మరణం పొందారని వ్యాఖ్య
TS Genco CMD gets emotional on Srisailam fire accident

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన ఎంతో దుఃఖాన్ని కలిగించిందని చెప్పారు. తన ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి విషాదకర ఘటనను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ప్లాంటులో మంటలు ఎగసిపడుతున్నప్పటికీ... ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, ప్లాంటును కాపాడుకునేందుకు ఉద్యోగులు సాహసోపేతంగా యత్నించారని కొనియాడారు. జాతి సంపదను కాపాడే ప్రయత్నంలో వీర మరణం పొందారని అన్నారు.

More Telugu News