ఇంత దారుణాన్ని ఎన్నడూ చూడలేదు: కన్నీటిపర్యంతమైన టీఎస్ జెన్ కో సీఎండీ
- శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 9 మంది దుర్మరణం
- ఎంతో దుఃఖాన్ని కలిగించిందన్న ప్రభాకర్ రావు
- వీర మరణం పొందారని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన ఎంతో దుఃఖాన్ని కలిగించిందని చెప్పారు. తన ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి విషాదకర ఘటనను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ప్లాంటులో మంటలు ఎగసిపడుతున్నప్పటికీ... ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, ప్లాంటును కాపాడుకునేందుకు ఉద్యోగులు సాహసోపేతంగా యత్నించారని కొనియాడారు. జాతి సంపదను కాపాడే ప్రయత్నంలో వీర మరణం పొందారని అన్నారు.