ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటో విడమర్చిన జనసేనాని!
- వినాయక చవితి నుంచి ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రచారం
- బీజేపీతో కలిసి ప్రజల్లోకి తీసుకెళతామన్న పవన్
- మన ఉత్పత్తులు, మన అభివృద్ధి అంటూ ప్రకటన
ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యం... ఈ కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వాములను చేయడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వినాయకచవితి నుంచే శ్రీకారం చుడుతున్నామని, మనదేశంలో ఏ పని చేయడానికైనా ముందు విఘ్నాలు తొలగించాలంటూ వినాయకుడికి పూజలు చేస్తామని, అందుకే వినాయక చవితి నుంచే ఈ పని మొదలుపెడుతున్నామని వివరించారు.
మన పండుగలు, ఆచార సంప్రదాయాల్లో సైతం మనకు తెలియకుండానే విదేశీ వస్తువులు చేరిపోతున్నాయని, ఆఖరికి దేవతామూర్తుల విగ్రహాలు కూడా విదేశాల్లోనూ తయారవుతున్నాయని పవన్ వెల్లడించారు. తద్వారా మనకు తెలియకుండానే ఆ దేశ అభివృద్ధికి దోహదపడుతున్నామని వివరించారు. ఇకపై మనం ఏది కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా లేక విదేశీ ఉత్పత్తా అనేది చూడాలని, అందుకు ఈ వినాయక చవితి నుంచే నాంది పలుకుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని స్పష్టం చేశారు. మన దేశీయ వస్తువులు కొంటే మన దేశ ఉత్పత్తిదారులకు ఉపయోగపడుతుందని తెలిపారు.