కరోనా చికిత్సలో వేపమందు.. 250 మందిపై పరీక్షలు!
- నిసార్గ్ హెర్బ్స్తో చేతులు కలిపిన ఏఐఐఏ
- 250 మంది రోగులపై పరిశోధన
- యాంటీవైరల్ డ్రగ్గా పనిచేస్తుందని ఆశాభావం
ఈ రెండు సంస్థలు కలిసి హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 250 మంది కరోనా రోగులపై వేప ఔషధాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత 125 మందికి వేప గుళికలు ఇచ్చినట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఈఎస్ఐసీ డీన్ డాక్టర్ అసీం సేన్ తెలిపారు. మొత్తం 28 రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రక్రియలో కరోనాపై పోరులో వేపమందు ఏమేరకు ప్రభావాన్ని చూపిస్తోందన్న విషయాన్ని డాక్టర్ అసీంసేన్ బృందం తెలుసుకోనుంది. వైరస్ను తరిమికొట్టడంలో వేపమందు యాంటీవైరల్ డ్రగ్గా నిలుస్తుందన్న నమ్మకం ఉందని నిసార్గా బయోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో గిరీశ్ సోమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.