Karnataka: హింస చెలరేగిన బెంగళూరులోని ప్రాంతాల్లో ఆర్‌ఏఎఫ్‌ 'ఫ్లాగ్‌ మార్చ్‌'.. వీడియో ఇదిగో

  • డీజే హళ్లీ, కేజీ హళ్లీ ప్రాంతాల్లో ఇటీవల హింస
  • ఆయా ప్రాంతాల్లో పోలీసుల చర్యలు
  • ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు
  • ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్  
Personnel of Rapid Action Force conduct flag march

ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయగా వివాదం రాజుకుని హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. బెంగళూరులోని డీజే హళ్లీ, కేజీ హళ్లీ ప్రాంతాల్లో జరిగిన ఈ హింస వల్ల పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు చేశారు.

ఈ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా విధించిన 144 సెక్షన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పర్సనల్ ఆఫ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ఫ్లాగ్‌ మార్చ్ నిర్వహించింది. ఎలాంటి శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో కలిసి పనిచేస్తోంది.

More Telugu News