బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి రెండోసారి కరోనా టెస్టులో నెగెటివ్
- మంగళవారం తొలి విడత టెస్టులో సిక్కిరెడ్డికి పాజిటివ్
- స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో మరోసారి పరీక్షలు
- సిక్కిరెడ్డికి కరోనా లేదని వెల్లడి
లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో కొన్నినెలలుగా మూతపడిన అకాడమీ, ఇటీవలే తెరుచుకుంది. అయితే భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆదేశాల మేరకు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, సహాయక సిబ్బంది, కోచ్ లు అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. తొలుత నిర్వహించిన ఈ టెస్టుల్లో సిక్కి రెడ్డికి, కిరణ్ కు తప్ప మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇప్పుడు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన రెండో పరీక్షలో సిక్కి రెడ్డికి కరోనా లేదని తేలడంతో అకాడమీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.