అమెరికాలో ఇలా చేస్తేనే... 80 వేల కరోనా కేసులొచ్చాయి: సోము వీర్రాజు
- దశల వారీగా విద్యాసంస్థలు ప్రారంభించాలని ఏపీ సర్కారుకు హితవు
- ఒకేసారి ప్రారంభిస్తే కరోనా వ్యాప్తి అధికమవుతుందని వెల్లడి
- ప్రజా రవాణా వ్యవస్థ లేకుండా విద్యార్థులెలా వస్తారన్న సోము
అందుకే అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాతే విద్యాసంస్థలు దశలవారీగా తెరవాలని సూచించారు. ముందుగా కాలేజీలు, ఆ తర్వాత జూనియర్ కళాశాలలు, ఆపై పాఠశాలలు విడతల వారీగా ప్రారంభించాలని తెలిపారు. అమెరికాలో ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించడం వల్ల 80 వేల మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. అంతేగాకుండా, ప్రజా రవాణా వ్యవస్థలపై ఆధారపడి 60 శాతం మంది విద్యార్థులు విద్యాసంస్థలకు వస్తుంటారని, బస్సులు ప్రారంభించకుండా వాళ్లు విద్యాసంస్థలకు ఎలా వస్తారని ప్రశ్నించారు.