పచ్చని మొక్కలు మతానికి విరుద్ధమట.. 6 వేల మొక్కలు పీకేశారు!
- ఇమ్రాన్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల మొక్కలను నాటిన వైనం
- పాకిస్థాన్ లోని ఖైబర్ రాష్ట్రంలో 6 వేల మొక్కలు పీకేసిన వైనం
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఖైబర్ ముఖ్యమంత్రి
అయితే మొక్కలను నాటిన గంటల వ్యవధిలోనే ఖైబర్ రాష్ట్రంలోని మండికాస్ జిల్లాలో కొందరు అతివాదులు రెచ్చిపోయారు. మొక్కలు నాటడం తమ మతానికి వ్యతిరేకమంటూ ఓ గ్రౌండ్ లో నాటిన దాదాపు 6 వేల మొక్కలను పీకేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఘటనతో పర్యావరణ ప్రేమికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఖైబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మొక్కలను పీకిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.