Corona Virus: కరోనా చికిత్సకు మరో ఔషధం.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

  • ‘నిక్లోసమైడ్’ పేరుతో మ్యాన్‌కైండ్ ఫార్మా నుంచి ఔషధం
  • ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్‌తో ఒప్పందం
  • ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు
Mankind Pharma joins hands with Daewoong to test niclosamide for COVID

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ను సమూలంగా తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అభివృద్ధి చేసిన టీకాలు వివిధ దశల్లో పరీక్షల్లో ఉండగా, రష్యా ఇప్పటికే ఓ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే కరోనా చికిత్సకు కూడా ఇప్పటికే కొన్ని ఔషధాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా, ‘నిక్లోసమైడ్’ అనే పేరుతో మ్యాన్‌కైండ్ ఫార్మా ఓ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

భారత్‌లో తొలిదశ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ మండలి  (డీసీజీఐ) నుంచి దీనికి ఇప్పటికే అనుమతి లభించింది. మరోవైపు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా సీవోవో అర్జున్ జునేజ్ తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చినట్టు అర్జున్ తెలిపారు.

More Telugu News