Andhra Pradesh: ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 87 మంది మృతి.. తాజా అప్డేట్స్ ఇవిగో!

  • 24 గంటల్లో కొత్తగా 9,024 కేసులు
  • 2,44,549కి పెరిగిన మొత్తం కేసులు
  • 2,203కి పెరిగిన మరణాలు
Andhra Pradesh witnesses 87 Corona deaths in as single day

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. ప్రతి రోజు అటూఇటుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,024 కేసులు నమోదయ్యాయి. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 58,315 మంది శాంపిల్స్ ని పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,372 కేసులు నమోదు కాగా తర్వాతి స్థానంలో కర్నూలు 1,138 కేసులతో ఉంది.     కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,203కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,597 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

More Telugu News