Sadananda Gowda: కలియుగం.. రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు: ఖుష్బూ

  • అయోధ్యకు భూమిపూజ చేసిన మోదీ
  • మోదీపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
  • మోదీని రాజుగా పేర్కొన్న సదానందగౌడ
Modi became bigger than LLord Rama critisices Khushboo

నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.

కర్ణాటక బీజేపీ ఎంపీ సదానందగౌడ ఈ ఉదయం ట్వీట్ చేస్తూ... తన ప్రియతమ రాజు మోదీని తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ట్వీట్ ను సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాముడి కంటే మోదీ ఎక్కువయ్యాడని... కలికాలం అంటే ఇదేనని విమర్శించారు.

More Telugu News