‘మర్డర్’ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు నోటీసులు జారీ చేసిన నల్గొండ జిల్లా సివిల్ కోర్టు
- సినిమా చిత్రీకరణను నిలిపివేయించమని గత నెల 29న కోర్టును ఆశ్రయించిన అమృత
- కేసు విచారణలో ఉండగానే సినిమా విడుదలైతే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్న పిటిషనర్
- ప్రతివాదులకు నోటీసులు పంపి, కేసును రేపటికి వాయిదా వేసిన కోర్టు
అమృత దాఖలు చేసిన సివిల్ దావాను విచారించిన కోర్టు ప్రతివాదులైన దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా నిన్న నోటీసులు జారీ చేసినట్టు అమృత తరపు న్యాయవాది తెలిపారు.