Budda Venkanna: వైసీపీ నేతలు అప్పట్లో ఏమన్నారో తెలుపుతూ.. ఆ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న

  • అమరావతే రాజధాని అన్నట్టుగా మాట్లాడిన నేతలు
  • ప్రజల్ని మోసం చేశారంటూ జగన్ పై బుద్ధా ధ్వజం
  • దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సవాల్
Buddha Venkanna shares a video of YSRCP leaders

ఏపీలో ఇప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతినే కొనసాగించాలని విపక్ష టీడీపీ పట్టుబడుతుండగా, మూడు రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ సర్కారు చెబుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు.

రోజా తదితర వైసీపీ నేతలు గతంలో రాజధాని అమరావతి గురించి ఏమన్నారో ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడమే జగన్ వైఖరికి నిదర్శనమని, జగన్ ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాడని చాలామంది హర్షిస్తున్నారని ఆ నేతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు విజయవాడ, గుంటూరుకు మధ్యలో ఇల్లు కట్టుకున్నాడని రోజా తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటైందని మరో నేత పేర్కొన్నారు.

ఈ వీడియో పోస్టు చేసిన బుద్ధా వెంకన్న దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. "అమరావతే రాజధాని అని ప్రజల్ని మోసం చేశావు, మూడు రాజధానుల అజెండాతో ప్రజాభిప్రాయానికి సిద్ధమా?" అని ప్రశ్నించారు.


More Telugu News