YSRCP: వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న గంటా?

  • 16వ తేదీన వైసీపీలో చేరనున్న గంటా
  • జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనునన్న మాజీ మంత్రి
  • వైసీపీలో చేరనున్న గంటా వర్గం
Ganta Srinivasa Rao to join YSRCP ON Aug 16

వైసీపీ చేప్టటిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో గంటా చేరబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఆగస్ట్ 15వ తేదీన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరిగినా... తాజాగా 16వ తేదీని ఫిక్స్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా గంటా వర్గానికి చెందిన పలువురు కూడా పార్టీలో చేరబోతున్నారు.

More Telugu News