కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా
- వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
- తనను కలిసిన వారు క్వారంటైన్లో ఉండాలని సూచన
- సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ దేవెగౌడ ట్వీట్
కాగా, సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలంటూ కరోనా బారినపడిన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ట్వీట్లో ఆకాంక్షించారు. యడియూరప్పతోపాటు ఆయన కుమార్తె పద్మావతి కూడా కరోనా బారినపడగా, కుమారుడు విజయేంద్రకు మాత్రం నెగటివ్గా నిర్ధారణ అయింది. అలాగే, యడియూరప్ప కార్యాలయంలోని ఆరుగురు సిబ్బందికి కూడా నిన్న కరోనా సోకింది. సిద్ధరామయ్య త్వరగా కోలుకోవాలని జనతా దళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ ఆకాంక్షించారు.