Advani: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజకు హాజరుకానున్న అద్వానీ, జోషి!

  • ఆగస్టు 5న అయోధ్యలో భూమి పూజ
  • శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని
  • అద్వానీ, జోషిలను ఫోన్ ద్వారా ఆహ్వానించిన ట్రస్టు
BJP senior leaders Advani and Joshi to attend Ayodhya Bhumi Poojan via video conference

దశాబ్దాల తరబడి కోర్టుల్లో నలిగిన అయోధ్య రామజన్మభూమి అంశం పరిష్కారమవడం తెలిసిందే. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ నెల 5న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు హాజరవుతున్నారు.

అయితే నాడు రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడంలేదు. వీరిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజలో పాల్గొంటారని తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అద్వానీ, జోషిలకు ఈ మేరకు ఆహ్వానం పంపింది. ఫోన్ ద్వారా భూమి పూజ సమాచారం అందించింది.

More Telugu News