ఎన్టీఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామ?
- 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
- ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేసిన దర్శకుడు
- కియరా అద్వానీతో సంప్రదింపులు
ఈ చిత్రానికి ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందనీ, ఈ లాక్ డౌన్ కాలంలో వీరిద్దరూ ఈ చిత్రంపై బాగా చర్చలు జరిపారనీ వార్తలొచ్చాయి. అసలు కరోనా మహమ్మారి లేకపోతే కనుక ఈపాటికే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి.
ఈ క్రమంలో ఇందులో నటించే కథానాయిక పాత్ర విషయమై ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ భామ, గతంలో తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలలో నటించిన కియరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం కియరాతో ఈ చిత్రం బృందం సంప్రదింపులు జరుపుతోందట.