ప్రకాశం జిల్లాలో దారుణం.. శానిటైజర్ తాగి 8 మంది మృతి
- వేర్వేరు ఘటనల్లో మొత్తం 8 మంది మృతి
- నాటుసారాలో కలుపుకుని కొందరు..
- మద్యానికి బదులుగా తాగి మరికొందరు మృత్యువాత
మరో ఘటనలో కురిచేడు పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే రమణయ్య నిన్న ఉదయం నాటుసారాలో శానిటైజర్ కలిపి తాగి ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, శానిటైజర్ తాగి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు నేడు మరణించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.