శ్రీవారి దర్శనానికి వచ్చి చిక్కుకుపోయిన రష్యన్ యువతి... ముందుకొచ్చిన మానవతా వాదులు
- తల్లితో కలిసి భారత్ వచ్చిన ఎస్తర్
- కరోనా లాక్ డౌన్ తో తిరుపతిలో నిలిచిపోయిన వైనం
- చేతిలో డబ్బులేక తీవ్ర ఇబ్బందులు
హైదరాబాదుకు చెందిన మారం ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అధిపతి సతీశ్ రూ.25 వేలు, తిరుపతిలో పనిచేస్తున్న ఏపీ ట్రాన్స్ కో అధికారి రూ.10 వేలు అందజేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫోన్ ద్వారా ఎస్తర్ తో మాట్లాడి ఆమె ఇబ్బందులను తెలుసుకున్నారు. తన పీఏ ద్వారా రూ.10 వేలు పంపడమే కాకుండా, బృందావనంలో ఉన్న ఆమె తల్లి ఒలీవియాను తిరుపతి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి రష్యన్ యువతి ఎస్తర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్తర్ తనకు సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంది.