డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ 40 మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- 40 మంది నుంచి రూ. 1.50 లక్షల చొప్పున వసూలు
- నిందితుడి నుంచి రూ. 8 లక్షలు, నకిలీ ఇళ్ల పత్రాలు, కారు స్వాధీనం
- గతంలో నకిలీ ఐడీకార్డుతో ఎస్సైగా చలామణి
అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఇళ్ల ఊసెత్తకపోవడంతో అనుమానించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 8 లక్షల రూపాయల నగదు, నకిలీ ఇళ్ల పత్రాలు, ఐడీ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మామూలోడు కాదని, గతంలో నకిలీ ఐడీ కార్డుతో ఎస్సైగా కూడా చలామణి అయ్యాడని, ఈ కేసులో విజయవాడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.