వైసీపీలో చేరే విషయమై ఇంకా స్పందించని గంటా శ్రీనివాస్!
- గత రెండు రోజులుగా గంటాపై వార్తలు
- గంటా చేరికను వ్యతిరేకిస్తున్న అవంతి వర్గం
- త్వరలోనే నిర్ణయాన్ని వెలువరించనున్న గంటా
కాగా, విశాఖపట్నం ప్రాంతంలో పట్టున్న వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ తో గంటాకు గతం నుంచే కొన్ని విభేదాలు ఉండటంతోనే ఆయన చేరిక ఆలస్యం అవుతోందని సమాచారం. అవంతి సైతం గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం గంటాకు అలవాటేనని ఇటీవల బహిరంగ విమర్శలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస్ ను సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. మరోమారు తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఆయన తన నిర్ణయాన్ని స్వయంగా వెల్లడిస్తారని గంటా శ్రీనివాస్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.