ఏపీ గవర్నర్తో నిమ్మగడ్డ రమేశ్ అరగంట పాటు భేటీ
- హైకోర్టు సూచనలతో భేటీ
- తిరిగి తనను ఎస్ఈసీగా నియమించాలని కోరిన నిమ్మగడ్డ
- గవర్నర్కు విజ్ఞాపన పత్రం అందజేత
దీంతో ఈ రోజు ఉదయం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. తనను ఎస్ఈసీగా మళ్లీ నియమించాలని ఆయనకు విజ్ఞాపన పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్తో ఆయన అరగంట పాటు మాట్లాడి వెళ్లారు. ఆయనను తిరిగి ఎస్ఈసీగా నియమించడంపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.