సంకీర్ణ ప్రభుత్వం దానికదే కుప్పకూలుతుంది: అమిత్ షాతో భేటీ తర్వాత ఫడ్నవిస్
- మహా సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయి
- షుగర్ కంపెనీల గురించి అమిత్ షాతో మాట్లాడాను
- ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు
మహారాష్ట్రలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని ఫడ్నవిస్ అన్నారు. కరోనాపై పోరాటమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని అమిత్ షాకు వివరించానని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలోనే అమిత్ షా తో భేటీ అయ్యారనే వార్తలను ఆయన ఖండించారు. అలాంటిదేమీ జరగడం లేదని చెప్పారు.