ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోలీస్ స్టేషన్లలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
- ఇప్పటికే పలువులు వైసీపీ నేతల ఫిర్యాదు
- తమపై అతస్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- తమను జంతువులతో పోల్చుతున్నారని మండిపాటు
- తాజాగా ఎమ్మెల్యేలు కారుమూరి, ముదునూరి ఫిర్యాదులు
తాజాగా, వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్రాజు కూడా రఘురామకృష్ణరాజుపై తణుకు, నరసాపురం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆయన తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, తమను జంతువులతో పోల్చారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. 'పందులే గుంపులుగా వస్తాయి' అంటూ వ్యాఖ్యలు చేసి కించపర్చారంటూ సదరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.