టీడీపీ హయాంలో కట్టిన 6 లక్షల ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలి: సీపీఐ రామకృష్ణ
- ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే కారణం
- ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
- ప్రభుత్వ సంస్థలను మోదీ నాశనం చేస్తున్నారు
విశాఖలో గ్యాస్ లీకేజ్ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై కూడా ఆయన స్పందించారు. ఈ ప్రమాదానికి సదరు కంపెనీ యాజమాన్యమే కారణమని చెప్పారు. ఎప్పుడైనా సరే ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఆరు లక్షల ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు.