House Sites: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

  • 8న జరగాల్సిన కార్యక్రమం
  • తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
  • ఆగస్టు 15న నిర్వహించే అవకాశం
AP Govt Cancells House Site Distribution

ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తుండటం, వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతోనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News