NGT: పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై నేడు గ్రీన్ ట్రైబ్యునల్‌లో విచారణ

  • గత నెల 30న సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో గ్యాస్ లీక్
  • ఇద్దరు ఉద్యోగులు మృతి, నలుగురికి గాయాలు
  • సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ఎన్‌జీటీ
Green Tribunal inquiry into Paravada gas leak incident today

జూన్ 30న పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో జరిగిన గ్యాస్‌లీక్ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌జీటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా, నేడు ఈ కేసును విచారించనుంది. మరోవైపు,  సాయినార్ లైఫ్ సైన్సెస్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News