ప్రియాంక గాంధీ బంగళాను బీజేపీ ఎంపీకి కేటాయించిన ప్రభుత్వం
- బీజేపీ ఎంపీ అనిల్ బలూనీకి లోధీ రోడ్డులోని బంగళా కేటాయింపు
- ఆగస్టు ఒకటో తేదీలోగా ఖాళీ చేయాలంటూ ప్రియాంకకు కేంద్రం నోటీసులు
- బంగళా కేటాయింపును రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు
బంగళా కేటాయింపు విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ప్రియాంక ఖాళీ చేసిన వెంటనే బలూని అక్కడికి మారతారని అధికారులు పేర్కొన్నారు. ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రత లేకపోవడంతో లోధీ రోడ్డులోని బంగళాను ఖాళీ చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. బంగళాను ఖాళీ చేసేందుకు ఆగస్టు 1ని తుది గడువుగా పేర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాత కూడా కొనసాగితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కాగా, ప్రియాంక గాంధీకి ఇప్పటి వరకు ఉన్న ఎస్పీజీ భద్రతను ప్రభుత్వం ఇటీవలే తొలగించింది.