YV Subba Reddy: లీజుకు తీసుకున్న స్థలంపై కర్ణాటక సీఎంతో చర్చలు జరిపాం: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

  • తిరుమలలోని కర్ణాటక చారిటీస్ ప్రాంతంలో లీజుకు స్థలం
  • నూతన వసతి సముదాయాల నిర్మాణాలపై చర్చలు
  • టీటీడీ అనుమతులు, నిబంధనలపై వివరించాం
yv subbareddy on ttd land

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో తాము చర్చలు జరిపామని  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మాణాలపై కర్ణాటక ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపినట్లు వివరించారు.

'తిరుమలలోని కర్ణాటక చారిటీస్ ప్రాంతంలో టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మాణానికి సంబంధించి టీటీడీ అనుమతులు, టీటీడీ నిబంధనల పై చర్చించడానికి శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గారితో సమావేశం అయ్యాము. ఇరుపక్షాల చర్చలు సుహృద్భావ వాతావరణంలో ముగిశాయి' అని చెప్పారు.

More Telugu News