అది ఫేక్ న్యూస్... ప్రకటన విడుదల చేసిన భారత్ బయోటెక్
- భారత్ బయోటెక్ ఉపాధ్యక్షుడు వీకే శ్రీనివాస్ పై ప్రచారం
- కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ న్యూస్ వైరల్
- అది రక్త సేకరణ ఫొటో అని వెల్లడించిన భారత్ బయోటెక్
ఓ నర్సు ఆయన చేతికి ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఆ ఫొటో భారత్ బయోటెక్ సంస్థ దృష్టికి వచ్చింది. దాంతో ఆ పరిశోధక సంస్థ వెంటనే వివరణ ఇస్తూ, ఆ ఫొటో వాస్తవం కాదని, ప్రచారం అవుతున్న న్యూస్ ఫేక్ అని స్పష్టం చేసింది. అది తమ ప్రొడక్షన్ స్టాఫ్ కు నిత్యం నిర్వహించే వైద్య పరీక్షల కోసం రక్తం సేకరిస్తున్నప్పటి ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.