కరాచీ ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం అంటూ పాక్ ఆరోపణ... కొట్టిపారేసిన భారత్
- కరాచీ స్టాక్ ఎక్చేంజిపై ఉగ్రదాడి
- భారత్ పై ఆరోపణలు చేసిన పాక్ విదేశాంగ మంత్రి
- పాక్ వ్యాఖ్యలు అసంబద్ధం అంటూ బదులిచ్చిన భారత్
దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ బదులిచ్చారు. పాకిస్థాన్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కొట్టిపారేశారు. దేశీయంగా ఉన్న సమస్యలను పొరుగు దేశంపైకి నెట్టడం సరికాదని పాకిస్థాన్ కు హితవు పలికారు. "ఉగ్రవాదంపై మీ వైఖరి ఇదేనా? అని పాక్ ను ప్రశ్నిస్తాం. ప్రపంచ ఉగ్రవాది లాడెన్ ను అమరవీరుడని కొనియాడిన పాక్ ప్రధాని వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ నిలదీస్తాం" అని పేర్కొన్నారు.