Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

  • జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
  • అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్
  • ఏకే-47, తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం
Three terrorists gunned down in jammu and kashmir

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఉదయం మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లా ఖుల్ చొహార్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కినట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సైన్యంతో కలిసి వెళ్లి ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. క్షణాల్లోనే అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47తో పాటు, మరో రెండు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News