Kangana Ranaut: చైనా వస్తువులను బహిష్కరిద్దాం: కంగనా రనౌత్

  • అందరం కలిసి చైనాపై యుద్ధం చేద్దాం
  • స్వాతంత్ర్యోద్యమం సమయంలో బ్రిటీష్ వస్తువులను బహిష్కరించారు
  • ఇప్పుడు మనం చైనా వస్తువులను బహిష్కరిద్దాం
Kangana Ranaut calls for ban on China goods

20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశానికి బుద్ది చెప్పాల్సిందేనని భారతీయులు నినదిస్తున్నారు. చైనా ఉత్పత్తులను, యాప్స్ ను నిషేధించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ, చైనాపై మండిపడింది. ఈ సమయంలో మనందరం ఏకతాటిపైకి వచ్చి, సంఘటితంగా చైనాపై యుద్ధం చేయాలని ఆమె తెలిపింది.

స్వాతంత్ర్యోద్యమం సమయంలో బ్రిటీష్ వస్తువులను బహిష్కరించారని... ఇప్పుడు మనందరం చైనా వస్తువులను బహిష్కరిద్దామని అభిమానులకు పిలుపునిచ్చింది. మరోవైపు ఇన్స్టా ద్వారా కంగనా ఈ పిలుపునిచ్చిన గంటల వ్యవవధిలోనే దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. కంగనా పిలుపుకు ఆమె అభిమానులు మద్దతును ప్రకటిస్తున్నారు. నిజ జీవితంలో కూడా నీవు 'క్వీన్'వే అంటూ కితాబిస్తున్నారు.

More Telugu News