అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుని, యువకుడి ఆత్మహత్య

man commits suicide in west godavari
  • భీమవరంలో ఘటన
  • ఓ యువకుడు కూడా తన ఆత్మహత్యకు కారణమని వీడియో
  • వారిని శిక్షించాలని కోరిన యువకుడు
  • రైలు కింద పడి ఆత్మహత్య 
ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేసిందని చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కన పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వివరాలు తెలిపారు.

మృతుడి పేరు జక్కంపూడి కనకారావు అని పోలీసులు చెప్పారు. తనతో ప్రేమ పేరుతో ఒక యువతి చనువుగా ఉంటూ చివరకు మోసం చేసిందని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే ఓ ముందు  సెల్ఫీ వీడియోలో తెలిపాడని వివరించారు.

ఆ అమ్మాయితో పాటు ఓ యువకుడు కూడా తన చావుకు కారణమని, వారిని శిక్షించాలని అతడు సెల్ఫీ వీడియోలో కోరాడని వివరించారు. ఆ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన అనంతరం తమ బంధువులకు పంపాడని చెప్పారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Go Back to Shorts
West Godavari District

More Telugu News