ఉద్రిక్తతల నడుమ లడఖ్ పర్యటనకు వెళుతున్న భారత ఆర్మీ చీఫ్
- నిన్న 11 గంటల పాటు చర్చించిన భారత్-చైనా
- చర్చల ఫలితాలపై రాని స్పష్టత
- రెండు రోజులు లడఖ్లో పర్యటించనున్న నరవాణె
కాగా, ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రోజు భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె లడఖ్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భద్రతతో పాటు అక్కడి పరిస్థితులను నరవాణె సమీక్షించనున్నారు. కాగా, గాల్వన్ లోయ నుంచి తిరిగి వెళ్లేందుకు చైనా అంగీకరించట్లేదని సమాచారం. గాల్వన్లోయ మొత్తం తమదేనని చైనా వాదిస్తున్నట్లు తెలిసింది.