ఫలించిన ప్లాస్మా థెరపీ... కోలుకున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్
- ఢిల్లీ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స
- శరీరంలో పెరిగిన యాంటీ బాడీలు
- ఆయన్ను జనరల్ వార్డుకు తరలిస్తామన్న వైద్యులు
ఈ చికిత్స సత్ఫలితాలను ఇచ్చింది. ఆయనలో పెరిగిన యాంటీ బాడీలు వైరస్ ను నిరోధించాయి. ప్రస్తుతం జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24 గంటల పాటు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తకుంటే, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్య బృందాలు వెల్లడించాయి. తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరిన ఆయనను, ఆపై మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించారు.