Keerthi Suresh: 'సర్కారు వారి పాట'కు హీరోయిన్ ఖరారు!

  • పరశురాం దర్శకత్వంలో మహేశ్ 
  • ముంబై భామల కోసం ప్రయత్నాలు
  • చివరికి కీర్తి సురేశ్ ఎంపిక
Keerthi Suresh finalized for Mahesh movie

మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రంలోని కథానాయిక ఎంపిక  కోసం గత కొన్నాళ్లుగా జరుగుతున్న కసరత్తు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామను ఎంపిక చేద్దామని ఆ దిశగా మొదట్లో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కైరా అద్వానీ, సయీ మంజ్రేకర్ వంటి భామలను సంప్రదించారు. అయితే, వీరెవ్వరూ కూడా ఈ చిత్రంలో నటించడానికి ముందుకురాలేదు. వీరడిగిన డేట్స్ వారి దగ్గర లేకపోవడమే కారణం.

దీంతో ఇక దక్షిణాది అమ్మాయినే ఖరారు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వీరి మొదటి ఛాయిస్ అయిన కీర్తి సురేశ్ ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. మహేశ్ కూడా కీర్తికే మొగ్గు చూపడంతో ఆమె ఎంపిక సులువయింది. వీరు కోరిన సమయాలలో కావలసిన డేట్స్ ను కూడా ఈ ముద్దుగుమ్మ కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News