Jammu And Kashmir: షోఫియాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

  • జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
  • 10 రోజుల్లో 19 మందిని హతమార్చిన సైన్యం
  • ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్‌సాస్ రైఫిళ్లు స్వాధీనం
3 Terrorists Killed In Encounter In Shopian

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్రామంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో  రాష్ట్రీయరైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున గాలింపు చేపట్టారు.

గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి ఏకే-47, ఇన్‌సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాగా, గత 10 రోజుల్లో 19 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

More Telugu News