తమిళనాడులో కరోనా బీభత్సం... 4 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్
- తమిళనాడులో 435 మంది మృతి
- నిన్న ఒక్కరోజే 1,974 కొత్త కేసులు
- 12 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్
కేవలం అత్యవసర సర్వీసులను మినహాయించి, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. జూన్ 19 నుంచి 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక రెండు ఆదివారాలు (జూన్ 21, 28) ఎలాంటి సడలింపులు లేకుండా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఆ సమయంలో పాలు, ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు, ఇతర వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తారు.