మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్!
- తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న కరోనా
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్
- ఇప్పటికే దీని బారిన పడ్డ ముత్తిరెడ్డి, బాజిరెడ్డి
హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో గణేశ్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకోగా... కరోనా పాజిటివ్ అని తేలింది. అదే ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డిని కలవడం వల్లే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కలిసిన అధికారులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.