ఎల్జీ పాలిమర్స్ పిటిషన్లపై వచ్చే వారాంతానికి నిర్ణయం తీసుకోండి: ఏపీ హైకోర్టుకు సుప్రీం స్పష్టీకరణ
- ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ
- సుమోటోగా తీసుకునేందుకు ఎన్జీటీకి అధికారం ఉందన్న సుప్రీం
- పాస్ పోర్టుల కోసం హైకోర్టుకు వెళ్లాలని ఎల్జీ పాలిమర్స్ కు దిశానిర్దేశం
అంతేగాకుండా, గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించే అధికారం ఎన్జీటీకి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పర్యావరణానికి ముడిపడి ఉన్న ఏ అంశంలోనైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్పందించేందుకు ఎన్జీటీకి అధికారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక, అధికారులు స్వాధీనం చేసుకున్న తమ సంస్థ డైరెక్టర్ల పాస్ పోర్టులు తిరిగి పొందేందుకు ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.