ఇమ్రాన్ ఖాన్ కు చురకలంటించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు
- పాకిస్థాన్ లో 1.10 లక్షలు దాటిన కరోనా కేసులు
- కరోనాను తేలికగా తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు
- ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు కరోనా బారిన పడ్డారన్న చీఫ్ జస్టిస్
కరోనా వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైరస్ కట్టడి కోసం తగు చట్టాలను కూడా రూపొందించాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు కూడా కరోనా బారిన పడ్డారని, తాము కూడా ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పారు. పాక్ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.