Supreme Court: ఎల్జీ పాలిమర్స్ కేసును ఈ నెల 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • విశాఖలో గ్యాస్ లీక్ ఘటన
  • 14 మంది మృతి
  • ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్
Supreme Court adjourned LG Polymers hearing to June sixteenths

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాల్సిందిగా కోరింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News