కుప్పకూలిన ట్రైనింగ్ విమానం ఇద్దరి మృతి!
- ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో ఘోర ప్రమాదం
- విమానం కుప్పకూలడంతో ట్రైనర్, విద్యార్థి దుర్మరణం
- కరోనా నేపథ్యంలో ఈనెల 1వ తేదీన తెరుచుకున్న అకాడమీ
ప్రమాదస్థలికి డెంకనాల్ ఎస్పీ, ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. శకలాలను తొలగించి మృత దేహాలను వెలికి తీశారు. మరోవైపు ఈ ఏవియేషన్ అకాడమీ కరోనా కారణంగా రెండున్నర నెలల పాటు నిలిచిపోయింది. జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయింది. మొత్తం 90 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండగా... రోజుకు 36 మందిని శిక్షణ విమానంలో తీసుకెళ్లి, ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో అకాడమీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.