Quarantine Centre: హోం క్వారంటైన్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న వైనం

  • కరోనా పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు
  • ఢిల్లీలోని తన నివాసంలోనే కొన్ని రోజులు ఉండాలని నిర్ణయం
  • అన్ని సమావేశాలను వాయిదా వేసుకున్న కేజ్రీవాల్
kejriwal home quarantine

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఎవరినీ కలవకుండా ఢిల్లీలోని తన నివాసంలోనే కొన్ని రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం, రేపు ఆయన పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే.

More Telugu News