ముగిసిన బోనీ కపూర్, జాన్వీ, ఖుషీల క్వారంటైన్!
- బోనీ నివాసంలో ముగ్గురు పనివాళ్లకు కరోనా
- కుమార్తెలతో కలిసి హోం క్వారంటైన్లోకి వెళ్లిన బోనీ
- అందరికి నెగెటివ్ నిర్ధారణ అయిందని తెలిపిన బోనీ
కరోనా చికిత్స పొందుతున్న వారందరూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని బోనీ చెప్పారు. ప్రభుత్వ విధివిధానాలను ప్రతి ఒక్కరు తుచ తప్పకుండా పాటించాలని సూచించారు. అందరం కలిసి కరోనాపై విజయం సాధిద్దామని చెప్పారు. తమకు సహకరించిన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, ముంబై పోలీస్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి కృతజ్ఞతలు చెపుతున్నామని తెలిపారు.
బోనీ కపూర్ ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో... వారిని క్వారంటైన్ కు పంపించారు. తన కుమార్తెలతో కలిసి బోనీ కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు.