తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదు: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐతో నిగ్గు తేల్చాలంటూ పిటిషన్
- అఫిడవిట్ సమర్పించిన కేంద్రం
- ఢిల్లీ పోలీసుల దర్యాప్తు భేషుగ్గా సాగుతోందని వివరణ
చట్టాన్ని అనుసరించి, రోజువారీ విధానంలో దర్యాప్తు జరుగుతోందని, నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కీలక దశలో ఉందని కేంద్రం వివరించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దర్యాప్తు పూర్తవుతుందని భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ జోక్యం అవసరంలేదని అనుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.