Prashanth Neel: కేజీఎఫ్ దర్శకుడికి విషెస్.. ఎన్టీఆర్ తో సినిమా పక్కా!

  • 'కేజీఎఫ్' సినిమాతో ప్రశాంత్ కు గుర్తింపు  
  • ఎన్టీఆర్ తో సినిమాకు సన్నాహాలు
  • ఇంతవరకు రాని అధికార ప్రకటన 
  • ప్రశాంత్ కు మైత్రీ మూవీ మేకర్స్ శుభాకాంక్షలు 
Prashanth Neel movie with NTR

'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందుతుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇది భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుందనీ, అందుకే ఎన్టీఆర్ ఏడాది పాటు దీనికి డేట్స్ కేటాయిస్తున్నాడనీ కూడా ప్రచారం జరిగింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తుందని అన్నారు.

అయితే, ఈ చిత్రం గురించి అధికారికంగా మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేదు. అటు దర్శకుడి నుంచి కానీ, ఎన్టీఆర్ నుంచి కానీ, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి కానీ ఏ విధమైన ఊసూ లేదు. అయితే, కొన్ని సంఘటనలు మాత్రం ఈ చిత్రం ఉందన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఆయనకు ప్రశాంత్ నీల్ శుభాకాంక్షలు చెప్పడం.. అందులో ఎన్టీఆర్ ఎనర్జీని ఆయన పొగడడం చూసి ఈ సినిమా కచ్చితంగా వుందని అభిమానులు డిసైడ్ అయిపోయారు.

ఇక, తాజా విషయానికొస్తే, ఈ రోజు ప్రశాంత్ నీల్ జన్మదినం. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది. దీంతో ఈ సినిమా పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లచ్చని అంటున్నారు.  

More Telugu News