AP Secretariat: ఏపీ సచివాలయానికి కరోనా దెబ్బ... 3,4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధం!

  • సచివాలయ ఉద్యోగికి కరోనా
  • సచివాలయం మొత్తం శానిటైజ్ చేస్తున్న వైనం
  • విధులకు హాజరుకాని 3, 4 బ్లాకుల ఉద్యోగులు
AP Secretariat employ tested corona positive

ఏపీ సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో, సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలతో శానిటైజ్ చేస్తున్నారు. 3, 4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు. దాంతో, ఈ రెండు బ్లాకుల ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కాగా, కరోనా సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన మిగతా ఉద్యోగులకు క్వారంటైన్ విధించారు.

More Telugu News